![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/once-again-hanuman-got-decent-trp-manodi-momentum-is-not-slowing-downa9cb7a94-0d3c-49c2-ae05-0309bda28e4e-415x250.jpg)
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఇటీవల రెండోసారి జీ తెలుగు ఛానల్లో ప్రచారం ఆయన సంగతి తెలిసిందే. మొదటిసారి ఈ మూవీ 11 టిఆర్పి రేటింగ్ను రాబడినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక రెండోసారి ఈ సినిమా డిఫరెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ రెండోసారి 5.37 టిఆర్పి రేటింగ్ను నమోదు చేసింది.
ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్ కి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. ఇక దీని సీక్వల్ కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని భార్య అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ మొదటి భాగం అంత పెద్ద హిట్ అయింది కనుక. హనుమాన్ మూవీ లో ప్రశాంత్ వర్మ రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను పిచ్చపిచ్చగా ఆకట్టుకున్నాయి. అందుచేత ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో త్వరలోనే తెలియనుంది.