![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/mega-hero-kosam-alanti-pani-chesina-matka-movie-makersba9f5b4a-c1d5-4a89-be06-4116c6d41f4b-415x250.jpg)
వెర్సటైల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ 'మట్కా'లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కతోందని సమాచారం.ఈ మట్కా సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. మ్యాసీవ్ స్క్రిప్ట్తో డైరెక్టర్ కరుణ కుమార్ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి నటిస్తుండగా, బాలీవుడ్ హాట్ బ్యూటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. హ్యుజ్ బడ్జెట్తో నిర్మించిన సెట్స్తో పాటు యూనిక్ కాన్సెప్ట్తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని 'మట్కా' మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.అయితే, మట్కా నిర్మాతల లక్ష్యం కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాటిక్ అనుభూతిని క్రియేట్ చేయడం అని తెలుస్తోంది. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కావాలని ఆకాంక్షిస్తున్నారు.