రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి మూవీలతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. బిగ్ బి అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీలో అత్యంత కీలక పాత్రలలో నటించగా , కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బ్యూటీ దిశ పటానీ ఈ మూవీలో హీరోయిన్గా నటించగా , వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ మూవీని ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఈ మూవీలో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ ,   శోభన ,  దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , మృనాల్ ఠాగూర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి అత్యంత భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో భాగంగా ఈ మూవీకి నైజాం ఏరియాలో ఏకంగా 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక నైజాం ఏరియాలో ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినట్లు అయితే చాలా ఈజీగా ఈ ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను అందుకుంటుంది అని చాలా మంది అంచనా వేశారు.

ఇక ఈ సినిమాకు మంచి ట్రాక్ వచ్చింది. దానితో ఈ మూవీకి నైజాం ఏరియాలో మొదటి రోజే 19 కోట్ల మేర షేర్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమాకు నైజాం ఏరియాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 2 వ రోజు నైజాం ఏరియాలో 10.03 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక మరో రెండు రోజులు కూడా ఈ మూవీకి నైజాం ఏరియాలో భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ సినిమా డీసెంట్ హోల్డ్ ను కంటిన్యూ చేసిన కూడా నైజాం ఏరియాలో బ్రేక్ ఈ ను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: