తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన యువ నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ నటి అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన జాతి రత్నాలు అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో చిట్టి పాత్రలో ఈమె తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమె జాతి రత్నాలు సినిమాలలో అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. మరి ఈ బ్యూటీ కి జాతి రత్నాలు సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం.

ఒక రోజు నాగ్ అశ్విన్కాలేజీ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లారట. అక్కడ ఫరియ చూసిన వెంటనే జాతి రత్నాలు సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చాలా బాగుంటుంది అని ఉద్దేశానికి వచ్చాడట. ఆ తర్వాత ఆమెను కలవడం , ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి చెప్పడం , ఆమె సంతోషంగా ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఈ ముద్దు గుమ్మకు జాతి రత్నాలు మూవీ లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందట.


ఇకపోతే జాతి రత్నాలు మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా మూవీ అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించింది. కొన్ని రోజుల క్రితమే ఈమె అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: