తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. వాటితో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. రాజు కెరియర్ను ప్రారంభించిన కొత్తలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మున్నా అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే ఈయన దర్శకుడిగా తన కెరీర్లు ప్రారంభించాడు. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించగా ... ప్రకాష్ రాజ్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేదు. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మున్నా సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు వివరించాడు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇలియానా హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్నా అనే మూవీని తెరకెక్కించాం. సినిమా చిత్రీకరణ దశలో ఉండగా అద్భుతంగా అనిపించింది. ఇక సినిమా విడుదల అయ్యింది.

ప్రేక్షకుల నుండి మిక్సెడ్ రెస్పాన్స్ వస్తుంది. నేను అదే సమయంలో ఆ సినిమాను చూశాను. కానీ నాకు ఏదో తేడా కొడుతుంది అని అనిపించింది. అదే చెబుదాం అని ప్రభాస్ దగ్గరికి వెళ్లాను. ఆ సమయంలో ప్రభాస్ హిట్ కొట్టాం అనే జోష్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వెళ్ళగానే నా దగ్గరికి వచ్చాడు. సినిమా సూపర్ అంట సార్ అన్నాడు. అది తప్పు రిపోర్ట్ ప్రభాస్ ... సినిమా జస్ట్ యావరేజ్ అవుతుంది అంతే అని చెప్పాను. ఏంటి సార్ అలా అంటున్నారు అని అన్నాడు. మూవీ జస్ట్ యవరేజ్ అవుతుంది అని ఫిక్స్ కా అన్నాను. చివరికి అదే జరిగింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: