బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ అనే నటుడితో గత రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న సోనాక్షి సిన్హా తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. సైలెంట్‌గా వివాహం చేసుకున్న సోనాక్షి, తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లై ఐదు రోజులు కూడా గడవకముందే సోనాక్షి సిన్హా హాస్పిటల్‌కు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘన్ సిన్హా హాస్పిటల్లో చేరాడు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ లోని ప్రముఖ నటుల్లో ఒకరు శతృఘన్ సిన్హా. తర్వాత రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు. అతని కూతురు సోనాక్షి సిన్హా కూడా బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మధ్యే అంటే జూన్ 23న ఆమె జహీర్ ఇక్బాల్ అనే నటుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ల పెళ్లి జరిగిన ఐదు రోజులకే శతృఘన్ హాస్పిటల్లో చేరాడు. వెంటనే ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే రొటీన్ చెకప్ కోసమే శతృఘన్ హాస్పిటల్లో చేరినట్లు తెలిసింది.అయితే వాళ్ల పెళ్లి జరిగిన ఐదు రోజులకే శతృఘన్ హాస్పిటల్లో చేరాడు.దీంతో అతన్ని చూడటానికి సోనాక్షి, జహీర్ హాస్పిటల్ కు వచ్చిన వీడియో వైరల్ అయింది. అతనికి ఏమైందో ఆందోళన అభిమానుల్లో కనిపించింది. అయితే రొటీన్ చెకప్ కోసమే అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తున్నారు. సోనాక్షి పెళ్లి సమయంలో హడావిడి కారణంగా కాస్త ఒత్తిడికి లోనవడంతో అతడు కాస్త అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: