ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్ మరియు దీపికా పదుకొనే అండ్ దిశా పటాని వంటి స్టార్ స్కేలక పాత్రలు పోషించిన సినిమా కల్కి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందింది. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది.

ఇక సినిమా అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక ఈ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన అశ్వినీతత్ ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తయిందా అని అడిగిన మీడియా మిత్రుల ప్రశ్నలకు స్పందిస్తూ కొంత భాగం పూర్తయింది ఇప్పటికే మూడు వేల అడుగుల ఫుటేజ్ మా దగ్గర ఉంది అని ఆయన అన్నారు.

అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే ముందు ఇప్పుడు అది ఏమి ఆలోచించలేదు అని పేర్కొన్న ఆయన బహుశా వచ్చే ఏడాది ఇదే సమయంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రస్తుతానికి ఈ రెండు భాగాలు మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నామని ఈ రెండు రిలీజ్ అయిన తరువాత అవకాశం ఉంటే మళ్లీ ఈ యూనివర్స్ లో భాగంగా సినిమాలు చేస్తామేమో నాగ్ అశ్విన్ నిర్ణయానికే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. ప్రజెంట్ అశ్విని దత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలను చూసిన పలువురు  పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: