ఈ సినిమాను 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాను హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తీశారు. ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది రెండో రోజు కూడా మంచి రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టింది.
దీని ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు అన్నీ కలుపుకుంటే సినిమా మొత్తం దాదాపు రూ. 300 కోట్ల రూపాయలకు చేరువలో ఉన్నాయి. ఇక రెండో రోజున రూ. 298.5 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు మూవీ టీం ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులలో మరొక కొత్త పాత్ర బయటకు వచ్చింది. ఇందులో సంతోష్ నారాయణన్ కూడా నటించారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇందులో ఇతని పాత్ర కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే ఉండడంతో పెద్దగా కనిపించలేదు. ప్రభాస్ కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత దిశా పటాని, ప్రభాస్ మధ్య ఓ పాట వస్తుంది. ఈ పాటలో సంతోష్ నారాయణన్ కనిపించాడు. కొద్ది సెకండ్ల పాటు ఇతని పాత్ర ఉండడంతో ఎవరికి పెద్దగా కనిపించలేదు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించిన విషయం తెలిసిందే.