తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి మొదటగా అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా చాలా సంవత్సరాలు కొనసాగారు. ఇక ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాగర్జున కూడా అనేక విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇప్పటికి కూడా నాగర్జున అద్భుతమైన విజయాలను అందుకుంటు వెళుతున్నాడు. ఆ తర్వాత నాగార్జున వారసులుగా అక్కినేని నాగ చైతన్య , అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇందులో నాగ చైతన్య ఇప్పటికే చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అఖిల్ ఇప్పటి వరకు కొన్ని సినిమాలలో నటించిన ఈయనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మినహాయిస్తే పెద్దగా విజయాలు ఏమీ లేవు. ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఏమీ అనుకోలేదు. యావరేజ్ మూవీ గా నిలిచింది.

దానితో ఈ యువ నటుడి ఒక భారీ హిట్ కోసం ఎంతో కసిగా ఎదురు చూస్తున్నాడు. ఇకపోతే ప్రతిసారి ఈయన సినిమా ప్రారంభం అయింది అంటే చాలా పబ్లిసిటీ అవుతూ ఉంటుంది. ఇక ఈ సారి అలా జరగకూడదు అని అఖిల్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఖిల్ తన తదుపరి మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని చాలా సైలెంట్ గా స్టార్ట్ చేసి , అంతే సైలెంట్గా పూర్తి చేసి అవుట్ పుట్ చూసిన తర్వాత నమ్మకం ఉంటేనే పబ్లిసిటీ గట్టిగా చేయాలి అని అఖిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ స్ట్రాటజీ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: