రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ...  అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. దిశ పటానీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ ,  దుల్కర్ సల్మాన్ ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మమూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు అయినటువంటి స్వప్న దత్ నిర్మించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దిశ పటానికి పాత్ర చాలా తేలిపోయింది. ఎందుకు అంటే ఇంత పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఈ సినిమాలో దిశా పటానీ , ప్రభాస్ మధ్య కేవలం పది నిమిషాల సన్నివేశాలు కూడా లేవు. వీరిద్దరి మధ్య ఒక సాంగ్ కూడా పెట్టారు. కానీ ఆ సాంగ్ కూడా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా గొప్పగా చిత్రీకరించలేదు.

ఇక ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా కనుక అద్భుతమైన విజయం సాధిస్తే దిశ పటానికి కూడా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ వస్తుంది అని అంతా భావించారు. అక్కడి వరకు ఓకే ... కానీ ఈ సినిమా ద్వారా దిశ పటానికి అద్భుతమైన క్రేజ్ వస్తుందా అంటే అది డౌట్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ మూవీలో ఈమె పాత్ర నిడివి తక్కువ ఉండడం , అలాగే అది కూడా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపకపోవడం దానితో హిట్ సినిమాలో హీరోయిన్గా నటించిన దిశా పటాని కి మాత్రం పెద్దగా గుర్తింపు రావడం కష్టంగానే కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: