నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో నాగ్ అశ్విన్ దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ భారీ సక్సెస్ను అందుకోలేకపోయినా విమర్శకుల ప్రశంసలను మాత్రం బాగానే అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి ప్రశంసలు రావడంతో పాటు కమర్షియల్ విజయం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఇంత గొప్ప విజయం తర్వాత ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా కల్కి అనే ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతునట్లు ప్రకటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీలో విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , మృనాల్ ఠాకూర్ , శోభన మరియు మరి కొంత మంది మంచి గుర్తింపు ఉన్న నటీనటులు ఈ సినిమాలో నటించారు అనే వార్తలు బయటకు వచ్చాయి. హాలీవుడ్ రేంజ్ ఉన్న సినిమాలో ఇంత గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తులు నటిస్తున్నారు అని తెలియడంతో వారి పాత్రలు ఏ స్థాయిలో ఉంటాయో.. వారు ఎంత ఇంపాక్ట్ ను చూపిస్తారో అని జనాలు అంతా భావించారు.

ఇక సినిమాలో నిజంగానే వీరంతా ఉన్నారు. కానీ వారి పాత్రలు ఈ సినిమాలో అత్యంత తక్కువ నిడివితో ఉండడంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో నటించిన రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ పాత్రలకు కథతో ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో కొంత మంది విరి పాత్రలు అవసరమా అనే ఆలోచనను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఏ మూవీకి ప్రపంచవ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: