ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్యే కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తన సంపాదనలో ఎంతో కొంత మొత్తంలో సమాజ సేవకు ఉపయోగిస్తూ ఉంటానని వెల్లడించారు రావు రమేష్. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఫౌండేషన్ కి మూడు లక్షలు విరాళాన్ని అందించినందుకు సినీ నటుడు నా మిత్రుడు రావు రమేష్ కి కూడా హృదయపూర్వకంగానే కృతజ్ఞతలు అంటే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ట్విట్టర్ నుంచి తెలియజేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా అభివృద్ధి వైపే తన అడుగులు వేస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది.. కానీ చాలా మటుకు తాను ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు మేనిఫెస్టో పథకాలకు ఎక్కువ డబ్బులు ఖర్చయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి.. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగ యువతను కూడా తగ్గిస్తాననే విధంగా తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపుగా తీసుకువెళ్తారో చూడాలి మరి. అలాగే కూటమిలో భాగంగా జనసేన పార్టీ కూడా అందుకు తగ్గ ప్రణాళికలతోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.