పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని మొదలు పెట్టిన తర్వాత భీమ్లా నాయక్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. దానితో పవన్ ఎక్కువ శాతం తనం ఇంట్రెస్ట్ ను ఆ మూవీ పై పెట్టాడు . దానితో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానితో ఆ సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేని హరిహర వీరమల్లు మూవీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమా చేస్తున్న సమయంలో పంజా వైష్ణ వ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా కొండపొలం అనే మూవీ ని రూపొందించాడు.

ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో పూర్తి అయ్యాయి. ఒకే సమయంలో విడుదల అయ్యాయి. ఈ రెండు మూవీ లు కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు మూవీ రీ స్టార్ట్ అయ్యింది. కాకపోతే కొంత కాలం పాటు షూటింగ్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడా విడి మొదలు కావడంతో పవన్ కళ్యాణ్ వాటిపై దృష్టి పెడ్డడం మొదలు పెట్టాడు. ఇక దానితో క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

ఈ మూవీకి సంబంధించిన మిగిలి ఉన్న షూటింగ్ను రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకో 25 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పవన్ కళ్యాణ్ దాదాపు మొత్తం ఉండబోతున్నట్లు సమాచారం. ఇక మరో నెల రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: