పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్ కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈనెల 27న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని  అందుకుంది. విడుదలైన మొదటి రోజు రికార్డులను సృష్టించింది. స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు సైతం దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్

 డైరెక్షన్ కి అందరూ ఫిదా అవుతున్నారు. కాగా ఈ సినిమాలో సుప్రీం యాస్మిన్ పాత్ర పోషించిన కోలీవుడ్ స్టార్ కమలహాసన్ తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అందులో భాగంగానే ఆయన కల్కి 2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇక కల్కి సినిమాలో చివరి పది నిమిషాలు కనిపించాడు కమలహాసన్. ఇందులో ఆయన పాత్ర పెద్దగా లేదు. కానీ పార్ట్ 2 లో మాత్రం ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. కల్కి సినిమాను తాజాగా చెన్నై లో

 చూసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..” కల్కి రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుంది. ఒక అభిమానిగా మొదటి భాగం చిత్రీకరణలో పాల్గొన్నా. ఇండియన్‌ సినిమా ఇప్పుడు గ్లోబల్‌ స్థాయిలో సందడి చేస్తోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు సహనం ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని అందంగా రూపొందించారు. నన్ను యువనటుల జాబితాలో చేర్చాలా.. అలనాటి నటీనటుల లిస్ట్‌లో చేర్చాలా అని చాలా ఆలోచించారు. చాలా ఓపికగా కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు” అంటూ చెప్పుకొచ్చారు.ఆయన మాటల్ని బట్టి కల్కి పార్ట్-2 లో కమల్ విలనిజం ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా బాక్సాఫీస్ దగ్గర రూ.190 కోట్లతో రికార్డ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: