టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని ఆఖరుగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాకు ముందు కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయిన అనంతరం మైత్రి మూవీ సంస్థ బ్యానర్ లో రవితేజ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ అయ్యింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ స్టార్ట్ కాలేదు. దానితో రవితేజ ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక గోపీచంద్ మలినేని , సన్నీ డ్యూయల్ హీరో గా రెజీనా హీరోయిన్ గా ఓ మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు జెట్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ఒక వేళ ఈ టైటిల్ కు మూవీ బృందం వారు ఎక్కువ శాతం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దీనినే మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సన్ని డియోల్ కొంత కాలం క్రితమే "గదర్ 3" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దానితో మంచి జోష్ లో ఉన్న గోపీచంద్ , సన్నీ కాంబోలో రూపొందనున్న ఈ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: