ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు 300 కోట్ల గ్రాస్ కలెక్షలను వసూలు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా కనబడుతూ ఉండేది. కేవలం కొన్ని హిందీ సినిమాలు మాత్రమే ఆ రేర్ మార్క్ ను టచ్ చేస్తూ ఉండేవి. ఇక అలాంటి సమయంలో రాజమౌళి "బాహుబలి" సినిమాతో పాన్ ఇండియా మూవీ కల్చర్ ను మొదలు పెట్టాడు. ఇక దానితో సినిమాలకు భాష హద్దులు లేకుండా పోయాయి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేసిన జనాలు చేస్తారు అనే ఉద్దేశంలో బాహుబలి సినిమాను ఐదు భాషలలో విడుదల చేయగా దేశమంతా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.

ఇక అప్పటి నుండి సౌత్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ పెరిగిపోయింది. ఒకరి తర్వాత ఒకరు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఏదైనా సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చినట్లు అయితే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అవలీలగా సినిమాలు టచ్ చేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి ఎక్కువ సార్లు 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన ముగ్గురు హీరోలు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ కి "బాహుబలి" సిరీస్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా వచ్చింది. ఇకపోతే ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన ఏకంగా 6 సినిమాలు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేశాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళ నటుడు తలపతి విజయ్ మూడు సినిమాలతో 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేశాడు. ఇక సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇప్పటి వరకు రెండు సినిమాలతో 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను టచ్ చేశాడు. ఇలా ఈ ముగ్గురు ప్రస్తుతానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి 300 కు పైగా గ్రాస్ కలెక్షన్లను ఎక్కువ సార్లు వసూలు చేసిన హీరోల లిస్టులో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: