17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఐసిసి టి20 వరల్డ్ కప్ ఫైనల్లో శనివారం ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఎన్నో నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్తంట రేపుతూ చివరికి టీమిండియా విజయం సాధించింది. అద్భుత విజయంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక భారత్ విజయం సాధించడం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు ఉత్తమ సోషల్ మీడియా మధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీని ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా అంతర్జాతీయ టి20 లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సతీమణి అండ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో భాగంగా జాతీయ జెండాను భుజంపై వేసుకుని ట్రోఫీని పట్టుకున్న విరాట్ కోహ్లీ ఫోటో షేర్ చేస్తూ.. " ఈ మనిషిని ఎంతో ప్రేమిస్తున్నాను. పూనా వాడివి అని చెప్పుకునేందుకు ఎంతో  కృతజ్ఞతరాలిని. ఈ క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి నా కోసం మెరిసే వాటిని తీసుకురా " అని క్యాప్షన్ జోడించింది.

అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా ఫోటోలు షేర్ చేస్తూ.. ఘనవిజయం తరువాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే నా కూతురు ఆందోళన చెందింది. వారిని దగ్గరకు తీసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంది. అవునునా డార్లింగ్. వారిని 150 కోట్ల మంది కగోలించుకున్నారు. అద్భుతమైన విజయం.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రజెంట్ అనుష్క శర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈట్వీట్స్ చూసిన వారంతా అనుష్క శర్మని సైతం ప్రశంసిస్తున్నారు. ఇక గత కొంతకాలం నుంచి అనుష్క శర్మ సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా అనుష్క శర్మని మళ్లీ సినిమాల్లోకి రియంట్రి ఇవ్వమంటూ బ్రతిమాలుతున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: