యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకుంటున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన హనుమాన్  సినిమా భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక దాంతో ఈయన చేయబోయే నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మాస్ హీరోతో ఈయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  ఆయన ఆ సినిమాకు సంబంధించిన కథ కూడా  రెడీ చేసినట్టుగా...అన్నీ కుదిరితే

 వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఈ యంగ్ డైరెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇక ఆ హీరో ఎవరంటే మాస్ మహారాజా రవితేజ.  మాస్ మహారాజా రవితేజ సైతం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు తను ఓకే చేసిన ప్రాజెక్టులను పూర్తి చేశాక ప్రశాంత్ వర్మతో కలిసి మూవీకి రెడీ అవుతారని తెలుస్తోంది. నిజంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనే దానిపై వేచి చూడాలి. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే...ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి

 సీక్రెట్ గా "జై హనుమాన్" అనే మూవీతో బిజీగా ఉన్నారు. కాగా ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా. గెటప్ శ్రీను, సముద్రఖని, వినయ్ రామ్, వరలక్ష్మి, శరత్ కుమార్ పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు.అంతేకాకుండా నిరంజన్ రెడ్డిసినిమా ను నిర్మించబోతున్నారు . ఇక 2025 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుంటుందో  చూడాలి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీని చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంట. అసలు రవితేజ కోతిగా ఎందుకు మారాడు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ప్రశాంత్ వర్మ చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యేంత వరకు తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: