ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలో వాడిన గ్రాఫిక్స్‌కు విశేష ఆదరణ లభించింది. కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ని అందరూ కొనియాడుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కల్కి సినిమాలో చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ను వాడాడు నాగ్ అశ్విన్. మృణాల్ ఠాకూర్, శోభనా, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ నటించారు.. అలాగే

 రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, అవసరాల శ్రీనివాస్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. కాగా అర్జునుడిగా విజయ్ దేవర కొండ నటించి మెప్పించాడు. కాగా కృష్ణుడి పాత్రను మాత్రం చూపించకుండా.. ఓ నల్లటి రూపంలో చూపించారు. తొలిరోజు ‘కల్కి 2898 AD’ ప్రపంచ వ్యాప్తంగా రూ.191 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.  ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా ఎంత హిట్ టాకు తెచ్చుకుందో అంత  ట్రోల్స్ కి కూడా గురవుతోంది. ఎందుకో తెలియదు కానీ చాలామంది సినీ విశ్లేషకులు ఈ

 సినిమాపై ట్రోల్స్ చేస్తున్నారు. అదే విధంగా తాజాగా ఇప్పుడు మరొక వార్తను తెరపైకి తీసుకువచ్చారు. అది ఏంటంటే  రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ డబ్బులు ఇచ్చి మరి పలు సైట్స్ చేత పాజిటివ్ రివ్యూలు రాయించుకున్నాడు అంటూ కొందరు పని పాట లేని వాళ్ళు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు . ఆయనలో ఇలాంటి గుణం కూడా ఉందా ..? అంటూ కొందరు కావాలని తప్పుపడుతున్నారు . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: