టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హ్యాపీ డేస్ సినిమాలో తన నటనతో ఎంతగానో మెప్పించిన నిఖిల్ ఆ తరువాత హీరోగా వరుస సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.. నిఖిల్ కు చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఆ తరువాత నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ 2  పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శ్రీకృష్ణుడి కథాంశంగా తెరకెక్కిన కార్తికేయ 2 తో నిఖిల్ తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు.కార్తికేయ 2 తరువాత నిఖిల్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.. ఇటీవల నిఖిల్ నటించిన స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. సుభాష్ చంద్రబోస్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 

ఇదిలా ఉంటే నిఖిల్ తాజాగా నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ ‘స్వయంభు’.. ఈ చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉంటే నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీని ఓకే చేసారు.గ్లోబల్ స్టార్ రాంచరణ్ నిర్మాణంలో నిఖిల్ “ది ఇండియా హౌస్ “ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.శివుని ఆశీస్సులతో రేపు హంపిలోని వీరూపాక్ష దేవాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనుంది. ఈ సినిమాను రామ్ వంశీ కృష్ణ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: