రెబల్ స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రాలలో కల్కి 2898AD చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈనెల 27 భారీగా విడుదలయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చి పెట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది కేవలం రెండు రోజులలోనే 298.5 కోట్ల రూపాయలను కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా కలియుగంతానికి మహాభారతానికి సైతం లింక్ పెట్టి ఈ సినిమాని అద్భుతంగా పెరకెక్కించారు డైరెక్టర్.

ఈ సినిమాని చూసిన వారందరూ కూడా డైరెక్టర్ని మెచ్చుకుంటున్నారు. సామాన్యులే కాకుండా రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంశాలు కురిపిస్తున్నారు. దాదాపుగా 600 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని అశ్వని దత్ నిర్మించారు. కానీ ఆయన మాత్రం ఈ సినిమాని చూడలేదట ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు. ఈ సినిమా సక్సెస్ సాధించిన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటివరకు కల్కి చిత్రాన్ని అసలు చూడలేదని తనకు పది రోజుల క్రితమే కంటి ఆపరేషన్ జరిగింది అని కూడా తెలియజేశారు.


అందుకోసమే కల్కి చిత్రాన్ని ఇంకా చూడలేదని మరో వారం రోజుల తర్వాత స్క్రీన్ చూడకూడదని వైద్యులు చెప్పడంతో కల్కి సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ సినిమా చూసిన వాళ్ళ ప్రేక్షకులు అదృష్టవంతులు అంటూ తెలియజేశారు. కల్కి రెండో భాగం గురించి కూడా తెలియజేస్తూ ఇప్పటికే 60% వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని త్వరలోనే మిగిలిన షూటింగ్ను కూడా పూర్తి చేయబోతున్నామంటూ వెల్లడించారు. పార్ట్-3 గురించి ఇంకా ఆలోచించలేదని వెల్లడించడం జరిగింది అశ్వని దత్.. ఏది ఏమైనా తాను నిర్మించిన సినిమాని ఇంకా చూడలేదని చెప్పి కాస్త అభిమానులకు షాక్ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: