వరుసగా హిట్ లతో జోష్ లో ఉన్న కాంబోలో సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. అదే వరుసగా హీరో అపజాయలతో ఉండడం , దర్శకుడు అపజయాలతో ఉండటం , ఏకంగా హీరోయిన్ కూడా అపజయాలతో ఉన్న కాంబోలో సినిమా వచ్చినట్లు అయితే అలాంటి సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఉండవు. చాలా కొన్ని సందర్భాలలో మాత్రమే ఇలాంటి కాంబినేషన్లో సినిమా వచ్చినప్పుడు అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా ఉంటాయి. అలాంటి అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో డబుల్ ఈస్మార్ట్ మూవీ ఒకటి.

సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇక ఈస్మార్ట్ శంకర్ మూవీ లో రామ్ పోతినేని హీరోగా నటించగా , పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీతో వీరిద్దరికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా అనంతరం రామ్ నటించిన ది వారియర్ , స్కంద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాగే పూరి జగన్నాథ్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కావ్య ధాపర్ ఇప్పటికే చాలా సినిమాలలో నటించింది. అందులో ఓ టీ టీ లో విడుదల అయిన ఏక మినీ కథ కు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమా కూడా థియేటర్లో పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ ముగ్గురికి కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. దానితో వీరు ముగ్గురు ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలి అని ఆశపడుతున్నారు. మరి ఈ సినిమా ఈ ముగ్గురికి ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: