అప్పుడెప్పుడో 'అప్పుడప్పుడు' అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది శ్రియా రెడ్డి. ఆ తర్వాత 'అమ్మ చెప్పింది' అనే చిత్రంలో యాక్ట్ చేసింది. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఇటీవల సలార్ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రాధ రమ మన్నార్‌గా శ్రియా రెడ్డి యాక్టింగ్ అద్భుతంగా చేసింది. పవర్‌ఫుల్ రోల్‌లో ఆమె కనిపించిన తీరు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.ప్రస్తుతం శ్రియా రెడ్డి జోరు మాములుగా లేదు. మొన్నే సలార్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ బ్యూటీ దసరాకి పవన్ కళ్యాణ్ ఓజీతో రాబోతుంది. ఇక సలార్ 2లో కూడా శ్రియా రెడ్డి కొనసాగనుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ శ్రియా రెడ్డికి 40 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. నటి శ్రియా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ఇండస్ట్రీలో ‘అప్పుడప్పుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత శర్వానంద్ 'అమ్మచెప్పింది'మూవీలో పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక తన మరిది విశాల్‌ పోగరు మూవీలో నెగిటివ్ క్యారెక్టర్‌లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించినది. ఈ చిత్రం తర్వాత 2008లో విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకున్న శ్రియా ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత సలార్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవర్ఫుల్‌ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. అదేవిధంగా సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా శ్రీయారెడ్డి ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో వైట్ షర్ట్ ధరించి బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఫోటోలకి ఫోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు వైట్ షర్ట్‌లో హాట్ లుక్స్‌తో హీట్ పుట్టిస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: