పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలై హిట్ టాక్ అందుకుంటూ దూసుకుపోతోంది. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైనా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 380 కోట్లు రాబట్టింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఎపిక్ వండర్ లో సాలిడ్ కాన్సెప్ట్ తో పాటుగా ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా భారీ తారాగణం కూడా కనిపిస్తుంది. అయితే ఈ తారాగణంతో ప్రభాస్ సరసన నటించిన దిశా పటాని మంచి అట్రాక్షన్‌గా నిలిచింది.కల్కి 2898 ఏడీ'తో బాలీవుడ్ భామ దిశా పటానీ మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలో ఆవిడ క్యారెక్టర్ లెంగ్త్ ఎంత అనేది పక్కన పెడితే... దిశ చేస్తే సినిమా సూపర్ హిట్ అనేది తెలుస్తుంది. ప్రభాస్‌తో ఉన్న ఒకే ఒక్క పాటలో ఆమెతో ఉండడం ఆ పాట కూడా మంచి రెస్పాన్స్‌ని అందుకోవడం ఇప్పుడు అభిమానుల్లో వైరల్‌గా మారింది.కాశీ నగరంలో నివశించే అమ్మాయిగా 'కల్కి 2898 ఏడీ' సినిమాలో దిశా పటానీ కనిపించారు. 'నీకు నువ్వు అంటేనే ఇష్టం భైరవ' అని ఆమె చెప్పే డైలాగ్ ట్రైలర్ లో ఉంది. కాంప్లెక్స్ లోపల పని చేసే అవకాశం దిశా పటానికి వస్తుంది. అప్పుడు ఆమె భైరవను తనతో పాటు తీసుకు వెళుతుంది. వాళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ లేదు. ఒక సాంగ్ ఉంది. మెయిన్‌గా ఈ సాంగ్‌లో దిశా గ్లామర్ షో అయితే బిగ్ హైలైట్‌గా మారిందనే చెప్పుకోవాలి.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రోక్సి పాత్రకి మొదట అనుకున్న హీరోయిన్ వేరట. ఆ హీరోయిన్ ఎవరో కాదు పాన్ ఇండియా క్రష్ రష్మికా మందన్నా అట. అయితే ఆమె ఈ పాత్రలో చేయాల్సి ఉందట కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం ఇంకా ఇతర కమిట్మెంట్స్ మూలాన రష్మీక ఈ సినిమాలో భాగం కాలేకపోయిందట. దీంతో దిశా పటానిని తీసుకున్నారంట. అయితే ఈ సినిమాలో దిశా రోల్ తప్ప మిగతా చిన్న చిన్న పాత్రలకి కూడా పెర్ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ కనిపిస్తుంది. సో రష్మిక ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసినా అందులో పెద్ద ఆశ్చర్యం లేదనే అనుకోవాలి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: