కల్కి 2898 ఏడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ పరంగాను రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా జూన్ 27న విడుదలైంది.  ప్రస్తుతం ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా భారతీయ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా అడుగులు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు భారీగానే రాబడుతున్నాయి. నాలుగో రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.85 కోట్లు వసూల్ చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా స్టార్ కాస్ట్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ. 302 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాటికి ఈ సినిమా రూ.85 కోట్లు కోట్ల రూపాయలను రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మహాభారతం ఎపిసోడ్ లోని అర్జునుడి పాత్రలో నటించాడు. అయితే తాజాగా ఈ సినిమాను విజయ్

 దేవరకొండ రష్మిక మందన తో కలిసి చూసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఎప్పటినుండో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై వీళ్ళిద్దరూ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చేసే కొన్ని పనులు మాత్రం నిజంగానే వీళ్ళు ప్రేమలో ఉన్నారు అని స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ షేర్ చేసే ఫోటోల ద్వారా వీళ్ళు ప్రేమలో ఉన్నారు అన్న క్లారిటీ వస్తుంది. చాలాసార్లు ఈ విషయంలో దొరికిపోయారు విజయ్ రష్మిక తాజాగా మరోసారి అలాగే దొరికిపోయారు.  సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఒకేసారి కల్కి సినిమా గురించి పోస్ట్ చేశారు. దీంతో వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా చూడొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: