స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ కల్కి 2898ఏడి. ఏకంగా మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచర్స్టిక్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. 600 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ అయితే మూవీ పై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనమే సృష్టిస్తోంది.


 ఏకంగా నాలుగు రోజుల్లోనే 552 కోట్లకు పైగా వసూలు సాధించి అదరగొట్టేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో అరుదైన రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది కల్కి మూవీ. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమల్ హాసన్ దీపికా పదుకొనేలాంటి ఎంతోమంది స్టార్స్ నటించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఇక థియేటర్కు వెళ్లి చూస్తున్న ప్రేక్షకులు.. ఇక ఈ మూవీలోని స్పెషల్ రోల్స్ అన్నింటిని చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే దాదాపుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కలిపి దర్శనమిస్తూ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఈ మూవీలో అటు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడాఒక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేస్తాడు.


 అయితే ఇక కల్కి మూవీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగ్ అశ్విన్ ఫై ఎంతో విశ్వాసం ఉంచినందుకు అశ్విని దత్, స్వప్న దత్ లకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వస్తున్న డబ్బులను నిల్వ చేయడానికి అశ్వినీదత్ ఏకంగా ఒక లోతైన బావిని తొవ్వాల్సి ఉంటుంది అంటూ రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. అయితే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఇక కల్కి మూవీతో నాగ్ అశ్విన్ తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్లాడు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: