సినిమాల్లో చాలా మంది నటీనటులు కథలను జడ్జ్ చేసి, హిట్ సినిమాలను వదులుకుని బాధపడుతుంటారు. అంతేకాకుండా కొందరి పక్కన నటించడానికి హీరోయిన్లు ఎందుకో ఒక్కోసారి ఆసక్తి చూపరు. అయితే ఆ సినిమా గతంలో మిగిలిన సినిమాల కంటే కలెక్షన్లు భారీగా సాధించినప్పుడు, సూపర్ హిట్ అయినప్పుడు ఆ సినిమా వదులుకున్న వారు లోలోపల మథనపడుతుంటారు. ఇదే కోవలో ప్రస్తుతం సినిమా సర్కిల్‌లో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. 

ప్రభాస్‌ను బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తక్కువగా అంచనా వేసిందనే వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. బాహుబలి వంటి భారీ హిట్ సినిమా తర్వాత ప్రభాస్ సాహో చేశాడు. ఆ సమయంలో కత్రినాను ఆ సినిమాలో నటించమని మేకర్స్ ఆమె కోసం 6 నెలలు వేచి చూశారు. అయితే ప్రభాస్ సినిమా హిట్ అవుతుందో లేదో అనే అనుమానంతో కత్రినాసినిమా చేయలేదని కొందరు పేర్కొంటున్నారు. ఇక సాహో సినిమా నిరాశపరిచినప్పటికీ కలెక్షన్ల విషయంలో తిరుగులేని విజయం సాధించింది. రూ.149 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించింది. ఇక ప్రభాస్ సరసన కత్రినా నటించకపోవడానికి గల కారణాలపై పలు రకాలుగా వదంతులు వస్తున్నాయి. దీనిపై ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ప్రభాస్, దీపిక పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్ వంటి అగ్రతారలు నటించిన కల్కి సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన దీపికకు సైతం మంచి పేరు వచ్చింది. ఆమెతో పాటు దిశా పటానీ సైతం ప్రభాస్ సరసన నటించింది. వీరిద్దరి కంటే ముందే 2019లో ప్రభాస్ సరసన కత్రినా నటించాల్సి ఉంది. సాహోలో శ్రద్ధాకపూర్ కంటే ముందే కత్రినాను మేకర్స్ సంప్రదించారు. అయితే సల్మాన్ సరసన నటించడానికి ఇష్టపడిన కత్రినా ప్రభాస్ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయింది.


 కొందరు డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కాకపోవడంతో కత్రినా నటించలేదని చెబుతుంటే, ప్రభాస్‌ను కత్రినా తక్కువ అంచనా వేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్లతో సమానంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఆయన నటించిన కల్కి సినిమా తొలి వీకెండ్‌లో రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో షారుఖ్ నటించిన జవాన్ రికార్డు రూ.519 కోట్లను కూడా ఈ సినిమా దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: