తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో నేహా శెట్టి ఒకరు. ఈమె కొంత కాలం క్రితం సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన డిజె టిల్లు మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందులో రాధికా పాత్రలో నటించిన ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా నేహకి ఒక మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి.

డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కూడా ఈమె చిన్న అతిధి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఆఖరుగా విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచినట్టు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ అభిమాని ఈమెను మీకు ఇష్టమైన సినిమా ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ నాకు ఈ మధ్య కాలంలో నాకు కల్కి సినిమా అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. ఇకపోతే కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా దిశా పటానిమూవీ లో హీరోయిన్గా నటించింది. నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: