టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాగార్జున - అమల జంట కూడా ఒకటి. వీరిద్దరూ ప్రేమ పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక రీసెంట్గా 32 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.. ఈ సందర్భంగా ఈ జంటకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసురాలు దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్న నాగార్జున.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమెతో విభేదాలు వచ్చి విడిపోయారు.. ఇక అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ అమలను ప్రేమించిన ఈయన దగ్గుపాటి లక్ష్మీతో విడాకులు జరిగిన తర్వాత అమలను 1992లో వివాహం చేసుకున్నారు.


వివాహం అనంతరం సంతోషంగా ఉన్న ఈ జంట ఇప్పటికీ  అంతే అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ జంట కు వివాహం జరిగి 32 ఏళ్ళు.. నాగార్జున హీరోగా ఎంతటి స్టార్డం సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. అటు అమలా కూడా 1986లో ప్రముఖ డైరెక్టర్ డి రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి మీని కడలి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇటు నాగార్జున కూడా తెలుగులో టైర్ -1 హీరోగా స్టార్ డం సంపాదించారు.  ఈ క్రమంలోనే ఇద్దరు కూడా తెలుగు సినిమాలలో నటించి బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.


ఇక అమల నాగార్జున దంపతులకు 1994లో అక్కినేని అఖిల్ జన్మించారు. అమలా విషయానికి వస్తే 1980 నుంచి 1990వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి అందరి హీరోల సరసన నటించింది.. తెలుగు,  తమిళ్, కన్నడ, మలయాళం,  హిందీ భాషల్లో కూడా ఒక వెలుగు వెలిగిన ఈమె చాలా సింపుల్ గా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే రీసెంట్గా తమ 32వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ జంట ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా వివాదాలకు దూరంగా ఉన్న జంటగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ జంటకి పలువురు సెలబ్రిటీలు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: