టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటిమానులలో నివేదా పేతురాజ్ ఒకరు. ఈ బ్యూటీ మోడలింగ్ రంగం ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ 2016 వ సంవత్సరం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఈమె తెలుగు , తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈ బ్యూటీ చిత్రలహరి , బ్రోచేవారెవరురా , అలా వైకుంఠపురంలో , బ్లడ్ మేరీ , విరాట పర్వం , పగల్ , దాస్ కా దమ్కి వంటి పలు సినిమాలలో నటించింది. ఇందులో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా భారీ స్థాయిలో అందాలను ఆరబోసి తన స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె డేటింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నివేదా మాట్లాడుతూ ... ఈ రోజుల్లో చాలా మంది లవ్ చేయడం లేదా డేటింగ్ చేయడం చేస్తున్నారు. చాలా మంది సింగిల్ గా ఉండడానికి చాలా భయపడిపోతున్నారు. ఇక అమ్మాయిలు డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి మంచి వాడా , చెడ్డ వాడా , అతడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే విషయాల గురించి బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం కోసం ముందుగా మీకు నచ్చిన అబ్బాయి తో కొంత కాలం ఫ్రెండ్షిప్ చేయండి. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత మీకు అతడు మంచివాడు అని నమ్మకం కలిగితే అప్పుడే అతనితో డేటింగ్ చేయండి అని ఈమె తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

np