సినీ, క్రికెట్ రంగాలకు విడిదిలేని అనుబంధం ఉంటుంది. రెండు రంగాలకు చెందిన వారు ఒకరితో మరొకరికి అవినాభావ బంధాలు ఉంటాయి. అయితే క్రికెటర్లు సినీ తారలతో కలిసి యాడ్స్, ఈవెంట్లలో కలుసుకోవడం వల్ల వారి మధ్య పరిచయాలు ఏర్పడి..ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లిగా కూడా మారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే లెజెండరీ క్రికెటర్ తో స్టార్ హీరోయిన్ సహజీవనం, పెళ్లి కాకుండానే తల్లిగా మారిన విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..భారతీయ సినీ, క్రికెట్ రంగాల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు ఇప్పటివి కావు..దాదాపు 5,6 దశాబ్దాల క్రితం నాటివే.

అప్పట్లో క్రికెటర్ పటౌడి, హీరోయిన్ షర్మిలా టాగోర్ (ప్రస్తుత హైఫ్ ఆలీఖాన్ తల్లిదండ్రులు) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వరకు చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే ఆ మధ్యలో రాయ్ లక్ష్మి, దీపికాలతో ధోని ఆ పైర్ వార్తలు బయటకు వచ్చాయి. కానీ అవి పెళ్లి వరకు వెళ్లలేదు. అయితే 80 దశకంలో క్రికెట్ ను శాసించిన స్టార్ బ్యూట్సిమెన్ వివియన్ రిచర్డ్స్ ఇండియాలో పర్యటించిన సమయంలో నీనా గుప్తాతో జరిగిన పరిచయం ప్రేమగా మారింది.

ప్రేమ సహజీవనంగా మారడంతో వారిద్దరూ కలిసి మెలిసి జీవించారు. వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తా మధ్య సహజీవనం ఫలితంగా వారికి ఓ కూతురు కలిగింది. ఆ కూతురే బాలీవుడ్ లో రాణిస్తున్న నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. అయితే చాలాకాలం రిచర్డ్స్, నీనా తమ అనధికారిగా దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వారిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోయారు. రిచర్డ్ కు ఇప్పటికే పెళ్లి అవ్వటం వల్ల తన దారి తను చూసుకున్నాడు. కానీ మసాలా గుప్తాను సింగిల్ పేరెంట్ గా ఆలన పాలన చూశారు. తన కూతురు కోసం వేరే పెళ్లికి దూరంగా ఉన్నారు. కూతురు పెద్ద పెరిగి తన పెళ్లి జరిగేంత వరకు ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత మరో వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: