![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/samantha54ea321f-4e0c-4d38-b882-9b3d8fcb69c9-415x250.jpg)
స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆగ్ర హీరోయిన్గా నిలిచింది. ఇక ఈ బ్యూటీ సినిమాల పరంగా తన కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. ఇక వివాహ అనంతరం సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ రంగస్థలం సినిమాతో తన హవాను కొనసాగించింది. ఇక ఈ సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉందని ఎంతోమంది ప్రశంసించారు. అయితే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా సమంతను కాకుండా వేరే హీరోయిన్ ని అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్.
ఇక ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ సుకుమార్ తో ఈ పాత్రలో సమంత అయితేనే చాలా అద్భుతంగా నటిస్తుందని సుకుమార్ కి చెప్పడంతో సమంతనే ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టి సినిమాను తీశారు. ఇక ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం సమంత వరుసగా సినిమాల్లో నటించి మళ్లీ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా....నాగచైతన్యతో తన వైవాహిక బంధాన్ని కొద్దిరోజుల పాటు సంతోషంగా గడిపింది.
వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అతి తక్కువ సమయంలోనే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధికి చాలా రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ఉంది సమంత. కొద్దిరోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే పూర్తిగా మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి సమంత సినిమాలలో నటిస్తూ మళ్లీ బిజీగా మారిపోయింది.