కొనేళ్ల క్రిందటి వరకు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా డార్లింగ్ హీరోగా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మాత్రం ఒక రేంజ్ కు వెళ్లిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ప్రభాస్ తో ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికైనా నిర్మాతలు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ప్రభాస్ డేట్స్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పాలి.


 ఇలా ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఇక ఎవరికైనా సరే కాస్త యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ప్రభాస్ లో మాత్రం ఇలాంటి యాటిట్యూడ్ ఎక్కడ కనిపించదు. ఏకంగా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తూ ఉంటాడు ప్రభాస్. అంతే కాదండోయ్ ఏకంగా సినిమాల్లో విలన్ లతో యాక్షన్స్ సన్నివేశాలు ఇరగదీస్తూ.. ఎలాంటి ఎమోషన్ అయినా ఈజీగా పండించగలిగే ప్రభాస్.. రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో సిగ్గు బిడియం కలిగి ఉంటాడు. అందుకే ఏకంగా సినిమా ఫంక్షన్లలో కూడా మాట్లాడటానికి ప్రభాస్ ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉండడం చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే.


 కేవలం సినిమా ఫంక్షన్ లో మాత్రమే కాదు.. సహనటులతో మాట్లాడేదానికి కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు ప్రభాస్. ఇదే విషయం గురించి హీరోయిన్ హంస నందిని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ కు చాలా సిగ్గు అని.. ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడడు. అంటూ హీరోయిన్ హంసనందిని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమా చేసే సమయంలో.. నేను టైటిల్ సాంగ్ లో  నటించాను.  కానీ ఆ సమయంలో సినిమా చూడలేకపోయాను. ఇక ఆ సమయంలో కూడా ప్రభాస్ పెద్దగా నాతో మాట్లాడే వారు కాదు. కానీ ఇక నేను సినిమా చూడలేదు అని తెలుసుకుని స్వయంగా టికెట్ బుక్ చేసి మరి సినిమా చూపించారు అంటూ హీరోయిన్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: