సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే విజయేంద్ర ప్రసాద్ , రాజమౌళి , మహేష్ కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయ్యింది అని చెప్పాడు.

ఇక రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంకో రెండు , మూడు నెలలలో ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళిసినిమా కోసం నటీనటులను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ లో విలన్ పాత్ర కోసం ఓ నటుడిని రాజమౌళి ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఈ మూవీ లో విలన్ పాత్రలో తీసుకోవాలి అని రాజమౌళి అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈయనను కొన్ని రోజుల క్రితమే కథను వివరించినట్లు , ఆయన కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ నటుడు కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తో ఈయనకు తెలుగు లో కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: