కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇదివరకే ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అందుకే ఈ సినిమా తర్వాత రాయల్ అనే సినిమాపై తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమాని తన స్వీయ దర్శకత్వంలో తెర. నిజానికి అన్ని అనుకున్నట్లుగానే

 జరిగి ఉంటే ఈ సినిమాను జూన్ లోనే విడుదల చేసేవాళ్ళు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త డిలే అవడంతో ఈ సినిమాను వాయిదా వేశారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాయల్ సినిమా తర్వాత ధనుష్ చేస్తున్న సినిమా కుబేర. వైవిధ్యమైన కథతో రాబోతున్న ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో కింగ్ నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు .దాంతో ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై

 ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కుబేర సినిమా తర్వాత ధనుష్డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కుబేర తర్వాత ధనుష్‌... ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తారన్నది ఇప్పటి వరకున్న సమాచారం. కానీ లేటెస్ట్ న్యూస్‌ ప్రకారం ఆయన సుధ కొంగర సెట్స్ కి జంప్‌ అవుతారట. ఆల్రెడీ సూర్యతో ఓ చేయడానికి సర్వం సిద్ధం చేశారు సుధ కొంగర. ఆ ప్రాజెక్ట్ పక్కనపడింది.. మరో స్క్రిప్ట్ తో ధ్రువ్‌ విక్రమ్‌తో చేస్తారనే వచ్చాయి. కానీ ఇప్పుడు సుధ ఇమీడియేట్‌ ప్రాజెక్ట్ ధనుష్‌తోనే అనీ, సూర్య కోసం చేసిన స్క్రిప్ట్ నే డీల్‌ చేస్తారనీ కోలీవుడ్‌ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: