టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన మధ్య ఏదో ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వినబడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. నిత్యం వీళ్ళ గురించి సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు రానే వస్తాయి. అయితే గతంలో వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ లో సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని.. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు

 వచ్చినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోరు ఈ జంట. ఎప్పుడూ ఈ విషయంపై నోరు కూడా చెప్పలేదు. అయితే తాజాగా వీళ్ళిద్దరి కాంబోలో ఒక సరికొత్త సినిమా రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మరి వీళ్ళిద్దరి కాంబోలో ఎటువంటి సినిమా రాబోతుంది అసలు ఈ వార్తలు నిజమైన అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం... గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతాగోవిందం సినిమాతో వీళ్ళిద్దరికీ మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాతో రష్మిక మందన నటనకి మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమా

 తరువాత తనకి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నిజానికి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' తో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేయాలి. అయితే తర్వాత ఆ పాత్రను మృణాల్ ఠాకూర్‌కి వచ్చింది. ఇప్పుడు 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ కొత్త కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. రాహుల్ దర్శకత్వం వహించనున్న కొత్త రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమా లో రష్మిక పాత్ర రాయలసీమ యాసలో మాట్లాడుతుందని తెలుస్తోంది. రష్మిక మందన్న ఇప్పటికే 'పుష్ప' లో అలాంటి పాత్ర చేసింది. అందుకే రాహుల్ డైరెక్షన్ లో వస్తున్న లోరష్మిక మందన్నా అయితే బాగుంటుందని టీమ్ భావిస్తుంది. విజయ్ దేవరకొండ కోసమే ఈ పాత్రకు రష్మిక మందన్న ఒప్పుకుంటుందనే నమ్మకంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: