ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా అదరగోడుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 680 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇక అతి త్వరలో రూ. 1000 కోట్లు సాధిస్తుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపికా, దిశా పటాని లాంటి స్టార్స్ నటించారు. బాలీవుడ్ లో 145 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ క్రమంలో ఈ సినిమా తరువాత ప్రభాస్ తదుపరి సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాల గురించి.. ఒక వార్త వైరల్ అవుతూ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అదేమిటంటే ప్రభాస్ చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. పైగా అవి అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ మధ్యనే విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న.. సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీకి సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. మరోపక్క ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో 'రాజాసాబ్' సినిమా చేస్తున్నాడు.


 ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం అయిపోయిందని సమాచారం. త్వరలో రాజా సాబ్ షూట్ మొదలుపెట్టి ..రెండు నెలల్లో పూర్తి చేస్తారని సమాచారం తెలుస్తోంది. ఇక రాజా సాబ్ తర్వాత.. సీతారామం సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్సినిమా చేయనున్నాడు. ఈ మూవీ సంబంధించి.. ఆల్రెడీ సెట్ వర్క్ జరుగుతోంది. పైగా మూడు పాటలు కూడా రెడీ అయినట్టు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.ఆ సినిమా తర్వాత కల్కి 2898 ఏడి కి కొనసాగింపుగా రాబోతున్న 'కల్కి 2' సినిమా షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. కల్కి 2 ఆల్రెడీ 60 శాతం షూట్ అయింది అని.. ఈమధ్య నిర్మాత అశ్విని దత్ తెలిపాడు. ఇక మిగిలిన షూటింగ్ వచ్చే సంవత్సరం చేయనున్నట్టు ఇటీవల నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.ప్రభాస్ యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ.. కాంబోలో 'స్పిరిట్' సినిమా కూడా అనౌన్స్ చేసారు. ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. వచ్చే ఏడాది షూట్ మొదలుపెడతారని ఇటీవల.. సందీప్ రెడ్డి వంగ తెలిపాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా ఉందని గతంలో ప్రకటించారు. ఇలా ఏకంగా.. వరుస పాన్ ఇండియా సినిమాలతో.. అందరి స్టార్ హీరోల కంటే బిజీగా ఉన్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: