ఈ మధ్యకాలంలో  పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ తో సమానంగా పోటీ పడుతున్న టాలీవుడ్  కోలీవుడ్ ఇండస్ట్రీలు ముందు వరుసలో ఉన్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ అందరూ బాలీవుడ్ స్టార్స్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు చాలామంది ఇండియన్ డైరెక్టర్స్ చేసిన సినిమాలతో బాలీవుడ్ స్టార్స్ కి భారీ విజయాన్ని

 అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ అందరూ వరల్డ్ వైడ్ గా సత్తా చూపిస్తున్నారు. వారు చేస్తున్న డిఫరెంట్ సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా చేస్తున్న సినిమాల్లో బాలీవుడ్ నటీ నటులని ఎక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ ఏడాది అలా వచ్చిన సినిమాల్లో అట్లీ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు అట్లీ. ఇక కేవలం హిందీ లోనే కాకుండా తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని

 అందుకుంది. కాగా ఈ సినిమా తర్వాత అట్లీ సల్మాన్ ఖాన్ తో మూవీ ప్లాన్ చేశాడు. సందీప్ రెడ్డి వంగా అయితే బాలీవుడ్ జెండా పాతేసాడు.  కబీర్ సింగ్ మూవీతో షాహిద్ కపూర్ కి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. గత ఏడాది యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ కి అతి పెద్ద సక్సెస్ ని అందించాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీస్ మరో రెండు ప్రాజెక్ట్స్ కోసం సందీప్ రెడ్డి వంగాతో అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా కల్కి2898ఏడీతో నాగ్ అశ్విన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీలో ఓ విధంగా అమితాబ్ బచ్చన్ మరో హీరో అని చెప్పాలి.  అలా టాలీవుడ్ టాలీవుడ్ నుండి వచ్చిన స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ హీరోలకి బిగ్గెస్ట్ హిట్స్ అందించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: