ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు.

కానీ ఆ సమయానికి ఈ మూవీ కి సంబంధించిన అనేక పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు. లేకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరి కాంబో మూవీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. చాలా రోజుల క్రితం నుండే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి అల్లు అర్జున్ రెడీగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత వీరిద్దరిలోనే ఒకరితో మొదట అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మధ్యలో అట్లీ వచ్చాడు. ఇక ఇప్పుడు అట్లీ సైడ్ కావడంతో ఈ ఇద్దరు దర్శకులు కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోతో కూడా సినిమా కమిట్ కాలేదు. బోయపాటి మాత్రం బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక దానితో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ కి మొదటి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. మరి బోయపాటి కూడా బాలకృష్ణ మూవీనీ తొందరగా పూర్తి చేసినట్లు అయితే ఆయనకు కూడా అల్లు అర్జున్ తో  మొదట సినిమా చేసే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa