టాలీవుడ్ లో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఉన్నారు. కానీ మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకోగలుగుతున్నారు. వారిలో ఒకరు హంస నందిని కూడా. టాలీవుడ్ నటి హంస నందిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా అంత గుర్తింపు తెచ్చుకొని ఈమె అనంతరం స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. అంతా బాగానే సాగుతుంది అనుకున్న సమయంలో క్యాన్సర్ బారిన పడింది హంస నందిని.


అనంతరం విదేశాల్లో చికిత్స తీసుకుని పూర్తిగా నయం అవ్వడంతో ఇండియా చేరుకుంది. ఇక ఈ క్రమంలోనే వరస ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రభాస్ సూపర్ హిట్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. హంస నందిని మాట్లాడుతూ.." ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ. అందుకే ఎవరితోనూ మాట్లాడరు. ఆయనతో నేను మిర్చి సినిమా చేశాను. అందులో టైటిల్ సాంగ్ స్టఫులు వేసా.


ఇక మూవీ అనంతరం నేను వేరే చిత్రంలో బిజీ అయిపోయాను. రిలీజ్ టైం లో కూడా హైదరాబాదులో లేను. కొన్ని రోజుల తరువాత వేరే సినిమా షూటింగ్ పని నిరాహా హైదరాబాద్ కి వచ్చాను. ఓ పార్టీలో ప్రభాస్ తో కలిశాను. మిర్చిలోని సాంగ్ సూపర్ హిట్ అయింది తెలుసా అని అడిగారు. దానికి నేను మూవీ చూడలేదు అని చెప్పాను. దీంతో వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పారు. అలాగే ఏ టైం కి ఆ సాంగ్ వస్తుందో కూడా చెప్పడంతో కరెక్ట్ గా అదే టైం కి వెళ్లి సినిమా చూశాను " అంటూ చెప్పుకొచ్చింది హంస నందిని. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: