అల్లు అర్జున్ , దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ , సి. అశ్వినీదత్ , కె. సత్య సాయి బాబా , కె. రాఘవేంద్ర రావు నిర్మించారు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాలో నిర్మాత అయినటువంటి అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ సినిమాలో తాను భాగస్వామి ఎలా అయ్యాను అనే విషయం గురించి చెప్పుకొచ్చాడు.

తాజాగా అశ్విని దత్ మాట్లాడుతూ ... అల్లు అర్జున్ "గంగోత్రి" సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాను మేము నిర్మించాము. నిజానికి అయితే అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యే మొదటి సినిమా మేము నిర్మించాల్సింది కాదు. అల్లు అర్జున్ ను తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలి అని అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఆ మూవీ ఆల్మోస్ట్ ఓకే అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో మేము గంగోత్రి అనే పేరుతో ఆయనతో రెండవ సినిమా చేద్దాము అని అనుకున్నాము.

అలాంటి సమయం లోనే తేజ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా చేయబోయే సినిమా ఆగిపోయింది అంటూ అనేక వార్తలు రాసాగాయి. దానితో నేను వెంటనే రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్లాను. తేజ , అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఆగిపోయింది అంట మనం అల్లు అర్జున్ ను హీరోగా లాంచ్ చేద్దామా అని అడిగాను. దానితో ఆయన ఓకే చేసేద్దాం అని అన్నాడు. వెంటనే గంగోత్రి కథను ఆయనకు వినిపించడం , ఆ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , అలా గంగోత్రి మూవీ సెట్ కావడం జరిగింది. ఇక ఆ తర్వాత నాతో పాటు అల్లు అరవింద్ మరి కొంత మంది కూడా ఈ సినిమాలో భాగస్వాములుగా అయ్యారు అని అశ్విని దత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: