సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ తన కెరీర్లో వస్తున్న 75వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అనే చెప్పాలి. అయితే సైంధవ్ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో తన తదుపరి సినిమాతో అయినా ఎలాగైనా హెట్టు కొట్టాలి అన్న ఉద్దేశంతో తనకి సక్సెస్ ఇచ్చిన

 అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 సినిమాలో వచ్చి ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వెంకటేష్ అని రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉన్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ స్టార్

 హీరో పాత్ర దాదాపుగా 30 నిమిషాల వరకు ఉంటుంది అన్న సమాచారం వినబడుతోంది .అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ అని తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి అనే సినిమా ఈ కాంబినేషన్లో రూపొంది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ చనువుతో బాలయ్యని అప్రోచ్ అయ్యాడు అనిల్. కానీ బాలయ్య ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ వర్కౌట్ అయితే వెంకటేష్- బాలయ్యని ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్య పాత్రలో కనిపించబోతుంది. మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: