తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రానా ఒకరు. ఈయన లీడర్ అనే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును ఈ సినిమా ద్వారా సంపాదించుకున్నాడు. ఇక రానా కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో విలన్ , కీలక , ముఖ్య పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే రానా ఇప్పటికే తెలుగు తో పాటు అనేక భాషల సినిమాలలో కూడా నటించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం రానా , తేజ దర్శకత్వంలో రూపొందిన నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

సినిమా రానా కు సోలో హీరోగా మంచి విజయాన్ని అందించింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరే కాంబోలో రాక్షస రాజా అనే సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లు లేవు. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే ఈ సినిమా పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తిగా ఆగిపోవడానికి ప్రధాన కారణం కొన్ని రోజుల క్రితమే దర్శకుడు తేజ , రానా తమ్ముడు అయినటువంటి అభిరామ్ హీరో గా అహింస అనే మూవీ ని తెరకెక్కించాడు.

ఇక పెద్ద స్థాయిలో అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రానా కి నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తేజ మంచి విజయాన్ని అందించిన తన తమ్ముడికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందించడంతో రానా , తేజ తో సినిమా విషయంలో వెనకడుగు వేసినట్లు , దానితో ఈ సినిమా ఆగిపోయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: