రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం, నార్త్ అమెరికా లో ఇప్పటికే ఫస్ట్ వీకెండ్ కి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ 13 మిలియన్ డాలర్లను రాబట్టడం జరిగింది. ప్రభాస్ తన రికార్డులను తనే బ్రేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద దూసుకు

 పోతున్నాడు. ఈ చిత్రం ఇదే దూకుడు కొనసాగిస్తే, లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. అయితే ఈ సినిమా విషయం కాసేపు పక్కన పెడితే.. కల్కి తరువాత తన తదుపరి సినిమాల పై ఫోకస్ చేస్తున్నాడు ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఇక ఆ సినిమాల్లో సలార్ టు కూడా ఒకటి. సలార్ సినిమా వచ్చి ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతోంది అంటూ ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని పార్ట్ వన్ వచ్చినప్పటి

 నుండే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్. ఈ నేపథ్యంలోనే పార్ట్ 2 కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అసలు మేటర్ ఏంటంటే..  దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఇప్పటికే షూటింగ్ డేట్స్ ఫిక్స్ చేశాడట. ఆగస్టు 10 నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలవబోతోందని సమాచారం. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ షూట్ టైమ్‌లోనే పార్ట్‌ 2కు సంబంధించి ఇరవై శాతం సీన్స్ చిత్రీకరించారు. ఇక ప్రభాస్‌ హీరోగా మారుతి తీస్తున్న 'రాజా సాబ్‌' సెట్స్‌పై ఉండగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్‌' తెరకెక్కాల్సి ఉంది. అలాగే 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్‌తో 'డ్రాగన్‌' అనే సినిమా చేయనున్నాడు ప్రశాంత్ నీల్.

మరింత సమాచారం తెలుసుకోండి: