మహేష్ రాజామౌళీల కలయికలో పాన్ వరల్డ్ మూవీగా త్వరలో షూటింగ్ ప్రారంభంకాబోయే మూవీలో మెయిన్ విలన్ గా పృథ్విరాజ్  సుకుమారన్ ఎంపిక అయ్యాడు అని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక భారీ సినిమా బ్లాక్ బష్టర్ హిట్ కు హీరోతో పాటు విలన్ పాత్ర ఎంపిక కూడ అత్యంత కీలకంగా మారింది. రొటీన్ విలనీ చూపించే పాత్రలను నేటితరం ప్రేక్షకులు పెద్దగా లైక్ చేయడంలేదు.



దీనితో విలన్ పాత్ర పోషించే నటుడు కూడ అందంగా ఉండటమే కాకుండా హీరోతో సరిసమానమైన క్రేజ్ ను మరీ ముఖ్యంగా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆసినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ‘సలార్’ మూవీతో పృధ్వీరాజ్ కు తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ మెయిన్ విలన్ గా మహేష్ కు సవాల్ విసిరే పాత్రలో పృధ్వీరాజ్ సరిపోతాడా అన్న సందేహాలు మహేష్ అభిమానులలో ఉన్నట్లు తెలుస్తోంది.



అయితే ఈవిషయంలో రాజమౌళి ఆలోచనలు వేరొక విధంగా ఉండి ఉంటాయి అని కొందరు భావిస్తున్నారు. జక్కన్న ‘ఈగ’ మూవీని తీసే సమయంలో ఆ మూవీలో సుదీప్ ను విలన్ గా ఎంపిక చేసుకున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ కొందరు చేశారు. అయితే ఆ మూవీ విడుదల అయిన తరువాత సుదీప్ స్టైలిష్ విలానీకి అందరు షాక్ అయ్యారు.



అదేవిధంగా మహేష్ తో రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న మూవీలో స్టైలిష్ విలన్ గా పృథ్విరాజ్ కనిపించబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక పూర్తి అయినప్పటికీ రాజమౌళి ఇంకా అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు అన్న సందేహాలు మహేష్ అభిమానులలో ఉన్నాయి. ‘ఇండియాన జోన్స్’ హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఈమూవీ ఉంటుందని లీకులు వస్తున్నాయి. ఈ సినిమా కూడ రెండు భాగాలుగా ఉంటుందని మొదటి భాగం 2026 సంక్రాంతికి విడుదల అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: