టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీసినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగించింది. దాదాపు 12 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సమంత తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.... సమంత సినిమాల పరంగా తన కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది.


ఇక వివాహ అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట కేవలం నాలుగేళ్లలోనే విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. ఇక ఆ చికిత్సకు ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్దిరోజుల పాటు సినిమాల్లో నటించింది. ఆ వ్యాధి మరింత తీవ్రతరం కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి సమంత మళ్లీ సినిమాల్లో రాణిస్తోంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెలిసిం.దే ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో ముందుగా సమంతను కాకుండా వేరే హీరోయిన్ ని అనుకున్నారట సుకుమార్. ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో ఆ సినిమాలో సమంత అయితేనే అద్భుతంగా నటిస్తుందని చెప్పారట. ఆ సినిమాలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సుకుమార్ వద్దని అన్నారట.


కానీ చిరంజీవి మాత్రం సమంత అయితేనే ఆ సినిమాలో అద్భుతంగా నటిస్తుందని ఆ పాత్రలో వేరే ఎవరు అంత బాగా నటించరని చిరంజీవి అన్నారట. ఇక చిరంజీవి అలా చెప్పడంతో సుకుమార్ కాదనలేక సమంతనే హీరోయిన్గా పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో నాగచైతన్య, సమంత మధ్య విభేదాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ విడిపోవడం నిజంగా చాలా బాధాకరం. వీరిద్దరూ కలుసుకోవాలని ఇప్పటికీ సమంత, నాగచైతన్య అభిమానులు కోరుకొంటూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: