పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి  భారీ విజయాన్ని అందుకుంటుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటాని, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వాటి స్టార్ నటినటులు కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది. రికార్డు స్థాయిలో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే. డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాతో ప్రేక్షకుల

 ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తాజా వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే... ప్రభాస్ తాజాగా "ది రాజ్ సాబ్" అనే సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించబోతున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ నెల 15 నుంచి ప్రభాస్ కు సంబంధించిన  షూట్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నీది అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటిస్తుండగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 అంతేకాకుండా తమన్  అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా. కార్తీక్ పళని  సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కాగా ఈ మూవీ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ వంటి భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక   విడుదలయిన మొదటి వారంలో ప్రపంచవ్యప్తంగా రూ.335 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది ‘కల్కి 2898 AD’.  ఈ సినిమా విడుదలయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికీ చాలా థియేటర్లు హౌజ్‌ఫుల్‌గా నిండిపోతున్నాయి. నాగ్ అశ్విన్ విజన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసించేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: