విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తన నటన, కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈయన నటించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు నటీనటులు మరియు దర్శకుల సహకారంతో మూడో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే వెంకీ అనిల్ రవిపూడి కాంబినేషన్ అంటే హిట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా 2025లో ప్రేక్షకుల ముందుకు

 తీసుకురాబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబో మూవీ స్టోరీ లైన్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై 58వ సినిమాగా తెరకెక్కిస్తుండడం గమనార్ధం. హీరో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతని ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే ఎక్స్ట్రాడినరీ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాను ఒకింత భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.  దీంతో వెంకీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్

 మూవీ ఉండబోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమా తర్వాత ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్  షేక్ చేస్తారేమో చూడాలి మరి. ఇదిలా ఉంటే వెంకటేష్ 15 కోట్ల వరకు అటుఇటుగా ఈ మూవీకి రెమ్యూనరేషన్ ఉందని తెలుస్తోంది. అనిల్ రవిపూడి కూడా ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారు. విక్టరీ, అనిల్, దిల్ రాజు ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ ను సాధిస్తారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు అంతా వాళ్ల కెరీర్ పరంగా బిజీగా ఉండడంతో అనిల్ రావు ఇప్పుడే సీనియర్ హీరోలపై దృష్టి పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: