విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2.తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్, ఏ సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎస్. జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఇండియన్ 2 సినిమాను మేకర్స్ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ 3 గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. '

ఇండియన్ 2 ‘చిత్రంలో నటించడానికి ఏకైక కారణం మూడో భాగం తాలూకు కథనే అని కమల్‌హాసన్‌ తెలిపారు.దర్శకుడు శంకర్‌ ఈ సినిమా మూడో పార్ట్‌ కథ చెప్పినప్పుడు తాను స్టన్ అయిపోయానని ఆయన తెలిపారు.'ప్రేక్షకులకు రెండో భాగం కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు..తనకైతే మూడోభాగం బాగా నచ్చింది. కానీ అది రిలీజ్‌ కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అప్పటి వరకు టెన్షన్‌గానే వేచి చూడాలి అని ఆయన అన్నారు.. మూడో భాగంలో సేనాపతి తండ్రి పాత్ర కూడా ఉంటుంది' అని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కూడా కనిపించనున్నట్లు సమాచారం. మరివైపు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: