అంబాని కోసం ఇండియా వచ్చిన జస్టిన్ బీబర్? 

అనంత్ అంబానీ ఇంకా రాధిక మర్చంట్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. రెండు ప్రీవెడ్డింగ్ వేడుకల తరువాత ఈ జంట పెళ్లి ముంబై - జియో సెంటర్ లో జూలై12 వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది.పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో సంబరాలు కూడా మొదలయ్యాయి. నిన్న అంటీళ్లా బంగ్లా వద్ద మామెరు వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు జాన్వీ కపూర్, ఓర్రీతో పాటు పలువురు హాజరయ్యారు. ఇషా అంబానీ, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇంకా శ్లోకా అంబానీ తదితరుల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అంతర్జాతీయ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ముంబైలో అడుగుపెట్టినప్పటి వీడియో ఒకటి అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.తాజాగా తెలుస్తున్న కథనాల ప్రకారం... అనంత్ అంబానీ - ముఖేష్ అంబానీల సంగీత్‌ వేడుకలో జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఎయిర్‌పోర్టు నుంచి భారీ భద్రత మధ్య ఆయన కారును రప్పిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది. 


దాదాపు ఏడేళ్ల తర్వాత జస్టిన్‌ బీబర్‌ తిరిగి ఇండియాకి వచ్చాడు. చివరిసారిగా జస్టిన్ బీబర్ ముంబైలో తన కచేరీలో ప్రదర్శన ఇవ్వడానికి ఇండియాకి వచ్చారు. ఇప్పుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్ళిలో అహూతులను రంజింపజేయనున్నాడు.జస్టిన్ బీబర్‌తో పాటు బాద్షా వంటి మరికొందరు కూడా అంబాని పెళ్లి వేడుకలో తమ ప్రదర్శన ఇవ్వబోతున్నారని సమాచారం తెలుస్తుంది. అయితే రాపర్ కరణ్ ఔల్జా కూడా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాలా మంది గాయనీగాయకుల పెద్ద పేర్లు హెడ్‌లైన్స్‌లోకి వచ్చాయి. అంతకుముందు, రాధిక మర్చంట్ ఇంకా అనంత్ అంబానీల వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అడెలె, డ్రేక్ , లానా డెల్ రే వంటి అంతర్జాతీయ తారలు చర్చలు జరుపుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ సంగీత్ వేడుక నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరపాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: